ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు టీడీపీ, జనసేన కలయిక ఎంతో అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 04:49 PM

 వైసీపీ భూతాన్ని భూస్థాపితం చేయడమే ధ్యేయంగా పని చేద్దామని టీడీపీ, జనసేన నేతలు ప్రకటించారు. శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం ఇరుపార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలయిక ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు ఎంతో అవసరమన్నారు. టీడీపీలోని అనుభవజ్ఞులైన నేతల బలం, జనసేనలో ఉత్సాహంతో ఉరకలెత్తే యువత బలం కలిస్తే జగనాసుర పాలన అంతం కాక తప్పదన్నారు.జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌,నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినుత మాట్లాడుతూ ఎమ్మెల్యే టిక్కెట్టు ఎవరికి దక్కినా మధుసూదన రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.టీడీపీ బలంగా ఉన్నచోట్ల జనసేన అలాగే జనసేన బలమున్న చోట్ల టీడీపీ కలిసి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు.వైసీపీ పాలనతో ప్రజలకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో పాటు టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అందించబోయే మేలును సమగ్రంగా వివరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య, టీడీపీ పట్టణాధ్యక్షుడు విజయకుమార్‌, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ కోశాధికారి కంఠా రమేష్‌, తెలుగుమహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష, తెలుగు రైతు ఉపాధ్యక్షుడు ప్రకా్‌షనాయుడు,జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, కోట చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa