ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 27నుండి కుల గణన సర్వే ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 04:51 PM

ఈనెల 27 నుంచి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కులగణన ప్రారంభం కానుందని కలెక్టర్‌ నాగలక్ష్మి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా కుల గణన సర్వే జరుగుతుందని, దీనికి యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. కుల గణనపై టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం సూచనలు ఇచ్చారు. ప్రజల సామాజిక స్థితిగతులను తెలుసుకోవడం కోసం కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కుల గణనపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. సర్వేలో కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలనే నమోదు చేయాలన్నారు. వాటికి సంబంధించిన ధ్రువ పత్రాలు అడగనవసరం లేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి సంబంధించి ఎవరి కులం వారికే నమోదు చేయాలని చెప్పారు. ఎవరైనా కులం పేరు చెప్పడానికి ఇష్టపడకపోతే వారిని బలవంతం చేయవద్దని, ఇది స్వచ్ఛందమేనని చెప్పారు. సేకరించిన సమాచారం ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటుందని, దీనిని ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు వెళ్లడించడం జరగదని చెప్పారు. కులగణన కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు మొబైల్‌ యాప్‌లో డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహిస్తారని.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వలటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి కుల గణన చేస్తారని తెలిపారు. ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేసినప్పుడు వారికి ఈకేవైసీ తప్పనిసరిగా చేస్తారని చెప్పారు. 8 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఈకేవైసీ తప్పనిసరి కాదన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ మయూర్‌అశోక్‌, జడ్పీ సీఈవో రాజకుమార్‌, సీపీవో బాలాజీ, డీపీవో నిర్మలాదేవి తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa