స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు లో నిందితునిగా ఉన్న చంద్రబాబుకు హైకోర్లు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ మీద విడుదలైన చంద్రబాబుకు.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలవబోతోందని నారా లోకేష్ అభివర్మించారు. "సత్యమేవజయతే" అన్నది మరోసారి నిరూపితమైందన్నారు. ఆలస్యమైనా సత్యమే గెలిచిందని చెప్పుకొచ్చారు. జగన్ కనుసన్నల్లో వ్యవస్థల మేనేజ్మెంట్పై సత్యం గెలిచిందని లోకేష్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మరోసారి సమున్నతంగా తల ఎత్తుకుని నిలబడిందన్నారు. "నేను తప్పు చేయను, తప్పు చేయనివ్వను" అని తరచూ చంద్రబాబు చెప్పే మాటే మరోసారి నిరూపితమైందని లోకేష్ పేర్కొన్నారు.
చంద్రబాబు మీద నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు... జగన్ కోసం, జగన్ వ్యవస్థల ద్వారా బనాయించిందని బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని లోకేష్ చెప్పుకొచ్చారు. అరెస్టు చేసి 50 రోజులకి పైగా జైలులో పెట్టి కనీసం ఒక్క ఆధారాన్ని కూడా ఇప్పటికీ కోర్టు ముందు ఉంచలేకపోయిన తప్పుడు కుట్రలు.. న్యాయం ముందు బద్దలయ్యాయని పేర్కొన్నారు. కేసులో ఆరోపించినట్టు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని, వాట్సప్ మెసేజ్ చాట్ అంతా బూటకమని స్పష్టమైందన్నారు.
చంద్రబాబుకి రూపాయి కూడా రాని స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారనేది అవాస్తవమని న్యాయస్థానమే తేల్చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కీంని స్కాంగా మార్చేసి చంద్రబాబు 45 ఏళ్ల క్లీన్ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి జగన్ అండ్ కో పన్నిన పన్నాగమని దేశమంతటికీ తెలిసిందన్నారు. హైకోర్టు వ్యాఖ్యలతో కడిగిన ముత్యంలా చంద్రబాబు.. ఈ కుట్రకేసులన్నింటినీ జయిస్తారన్నారు. సత్యం గెలిచింది.. జగన్ అనే అసత్యంపై యుద్ధం ఆరంభం కానుందని లోకేష్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa