గుజరాత్లోని పాత ముంద్రా ఓడరేవులో పడవలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు బియ్యం లోడింగ్లో ఉన్న బోటులో మంటలు చెలరేగాయి. సరుకులో ఎక్కువ భాగం బియ్యం కావడంతో పడవ నిప్పుల కుంపటిలా మారింది. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అదానీ గ్రూప్కు చెందిన రెండు, మరో ప్రైవేట్ కంపెనీకి చెందిన మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాయి. జామ్నగర్లో రిజిస్టర్ అయిన పడవ అమద్భాయ్ సంధర్కు చెందినదిగా గుర్తించారు. ఓడరేవులో అగ్నిమాపక హెచ్చరికలు రావడంతో ఓడరేవు నిర్వహణ విభాగం, పోలీసులు వేగంగా స్పందించారు. పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేయాల్సి ఉన్నప్పటికీ అగ్నిమాపక సిబ్బంది మంటలను చాలా వరకు అదుపులోకి తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa