ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ ఒక అశుభం అందుకే ఇండియా వరల్డ్‌కప్ ఓడిపోయింది: రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 09:43 PM

ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల హోరాహోరీ జరుగుతోంది. ఇప్పటికే 3 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగా మరో రెండు రాష్ట్రాల ఎన్నికలు ఈనెల 30 తో ముగియనున్నాయి. ఈ క్రమంలోనే అధికార, విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వ్యక్తిగతంగా కూడా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ముగిసిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ ఓటమికి కారణం ప్రధాని అని ఆరోపించారు. నరేంద్ర మోదీ ఒక చెడు శకునం అంటూ తీవ్ర విమర్శలు చేశారు.


రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అక్కడ అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జలోర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించకపోవడానికి ప్రధాని మోదీనే కారణమని మండిపడ్డారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఒక చెడు శకునం అని పేర్కొన్నారు.


ఆదివారం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడం వల్లే టీమిండియా ఓటమి పాలైందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు సంధించారు. టీమిండియా ఆటగాళ్లు టోర్నీలో జరిగిన అన్ని మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించి అప్రతిహత విజయాలు సాధించి దాదాపు ప్రపంచకప్ గెలుచుకున్న దశలో వారిని చెడు శకునం ఓడిపోయేలా చేసిందంటూ.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


రాజస్థాన్ అసెంబ్లీలో ఉన్న 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 199 స్థానాలకు నవంబర్ 25 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని అధికారం నుంచి గద్దె దించాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు.. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల మేనిఫేస్టోలు, హామీలు, ఉచితాలతో రాజస్థాన్ వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే రాజస్థాన్‌లో వరుసగా ఏ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రాదు అనే సంప్రదాయం ఉంది. దీంతో ఓటమిపై కాంగ్రెస్ భయంగా.. గెలుపుపై బీజేపీ ధీమాగా ఉన్నాయి. అయితే మరి రాజస్థాన్‌ కుర్చీ ఎవరికి దక్కుతుందో చూడాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa