ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టు ధిక్కరణకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 02:21 PM

సీఐడీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రశ్నించే వారిని జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ గ్యాంగ్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఆరోపించారు. నిత్యం 144, 30 సెక్షన్లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఐడీతో కలిసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తానెప్పుడు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ‘‘ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఎన్నిరోజులు జైలులో పెడతారు?. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే జగన్ రాష్ట్రానికి అవసరమా?. జగన్ గ్యాంగ్ మేసే గ్యాంగ్.. ఆయన ఉద్దేశ్యం ప్రజలను భయపెట్టడం, జైలుకి పంపటం అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa