విజయవాడవాసుల్ని హెచ్చరించారు పోలీసులు. నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా వారి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ మద్యం తాగి వాహనాలు నడిపే వారి కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామన్నారు.
నగరంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతి భద్రతల విభాగం పోలీసులు సైతం డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 1,326 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 376 మందికి జైలుశిక్ష విధించటంతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.14 కోట్ల జరిమానాలు విధించారు. తాగి వాహనాలు నడిపితే.. జైలుపాలేనని సీపీ హెచ్చరించారు.
నగరంలో శాంతి భద్రతలకు, సామాన్య ప్రజల జీవనానికి విఘాతం కలిగిస్తూ, అవాంఛనీయ సంఘటనలకు, గంజాయితో పాటూ మత్తు పదార్థాలు సేవించి అల్లర్లు, సమాజంలో అలజడి సృష్టిస్తున్న అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఉప్పుగల్ల సాయి మహేష్ని నగర బహిష్కరణను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ నేరు తీవ్రతను బట్టి నగర బహిష్కరణ చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa