2023 వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆట అన్నాక గెలుపోటములు సహజమే. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు.. ఆ ఓటమి నుంచి తేరుకుని మరో సిరీస్కు సిద్ధమైంది. అయితే ఈ ప్రపంచకప్ ఓటమి మాత్రం రాజకీయంగా పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. రాజకీయ నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో మాటల దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కొత్తరకమైన వాదనను తెరపైకి తీసుకువచ్చారు.
టీమిండియా ఓటమిపై తాజాగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కారణంగానే భారత జట్టు ప్రపంచ కప్ గెలవలేకపోయిందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి రోజునే భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరిగిందని.. అందుకే భారత్ ప్రపంచకప్ గెలవలేదని సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఇందిరాగాంధీ కారణంగానే ఇండియా ఓడిపోయిందని.. దయచేసి గాంధీ కుటుంబసభ్యుల పుట్టిన రోజుల్లో టీమిండియాతో మ్యాచులు ఆడించవద్దని హిమంత బిశ్వశర్మ పేర్కొనడం సంచలనంగా మారింది.
భారత్ ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచ కప్ 2023 టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడిందని.. అన్ని మ్యాచ్లలో అప్రతిహతంగా విజయాలు సాధించి ఫైనల్కు చేరుకుందని పేర్కొన్నారు. ఈ వరల్డ్ కప్లో టీమిండియా ఆటగాళ్ల ఫామ్ చూస్తే తప్పకుండా ఈసారి టైటిల్ భారత్దేనని అంతా భావించారని.. కానీ అనూహ్యంగా ఫైనల్లో ఓడిపోయి.. చివరకు రన్నరప్తో సరిపెట్టుకుందని తెలిపారు. అయితే ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీయగా.. అప్పుడే అసలు విషయం తెలిసిందని పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 19 వ తేదీన జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ రోజు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పుట్టిన రోజు అని ఆ కారణంగానే టీమిండియా ఓటమి పాలయ్యిందని.. హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa