రాజస్థాన్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే అధికారులు ఈవీఎమ్ బాక్స్లతో పోలింగ్ బూతులకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం ఐదు రాష్ట్రాలు రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఓటర్లంతా తమ ఓటు హక్కను వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పలు చోట్లు ఇప్పటికే భారీ ఎత్తును క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఓటు వేశారు.
మరికొన్ని చోట్ల మాత్రం ఓటింగ్ నెమ్మదిగా మొదలైంది. సమయం గడిచే కొద్దీ పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ సమయంలో ఎక్కడా ఉద్రికత్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. కాగా 199 స్థానాలకు 1,862 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం ఓటర్లు 5,25,38,105 మంది కాగా.. వీరిలో మూడో వంతు మంది (1,70,99,334) 18-30 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వీరిలోనూ 22,61,008 మంది (18-19 ఏళ్లవారు) తొలి సారి ఓటు వేస్తున్నవారు ఉన్నారు. ఓటర్లలో పురుషుల సంఖ్య 2.73 కోట్లుగా మహిళా ఓటర్ల సంఖ్య 2.52 కోట్లుగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa