ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో కంది పప్పు సరఫరా చేసేందుకు సిద్ధమైంది. నాలుగు నెలలుగా సరుకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల మాత్రమే సరఫరా జరుగుతోందని చెబుతున్నారు. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. డిసెంబర్, జనవరిల్లో పూర్తి స్థాయిలో కార్డుదారులకు సబ్సిడీ కందిపప్పును ఇస్తామంటున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువకే కందిపప్పును అందించనున్నారు. అంతేకాదు ప్రభుత్వం గోధుమ పిండిని రూ.16కే సరఫరా చేస్తుంది.
కార్డుదారులకు ప్రతి నెలా నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. హాకా ద్వారా కందిపప్పును సేకరించి.. ఇప్పటికే నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. డిసెంబర్, జనవరిల్లో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తామంటున్నారు అధికారులు. రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు కందుల కొనుగోలుపై ప్రచారం కల్పించారు. రైతుల నుంచి మార్కెట్ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే.. రైతులకు, లబ్దిదారులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం కందిపప్పును సబ్సిడీపై కిలో రూ.67కు పంపిణీ చేస్తోంది. గడిచిన 4 నెలలుగా సరుకు అందుబాటులో లేకపోవడంతో సరఫరాల అవరోధం ఏర్పడింది. తాజాగా హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ ద్వారా పౌరసరఫరాల శాఖ సుమారు 10వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. దశల వారీ సరఫరాలో భాగంగా నవంబర్ నుంచే సరుకును అందించడంతో కార్డుదారులకు ఊరట లభించింది. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కార్డుదారులుందరికీ పంపిణీ చేయనుంది. ఇకపై కందిపప్పు సరఫరాలో జాప్యం లేకుండా డిసెంబర్ చివరినాటికి నుంచి స్థానిక రైతుల ద్వారా కందులు కొనుగోలు చేయడంతో పాటు ప్రాసెసింగ్ చేసి అందించనుంది.
అంతేకాక కేంద్రం కంటే మిన్నగా గడిచిన మూడు నెలల నుంచి పౌరసరఫరాల శాఖ ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరాల చేస్తోంది. కేంద్రం మాత్రం తాజాగా భారత్ బ్రాండ్ పేరుతో కిలో గోధుమ పిండిని రూ.27.50 ఇస్తున్నట్టు ప్రకటిచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.16కే అందిస్తోంది. ఇప్పటి వరకు 10,625 టన్నులు పంపిణీ చేయగా డిసెంబర్లోనూ 4వేల టన్నులకు పైగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అంటున్నారు అధికారులు. ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల నుంచి నేరుగా కందులను కొనుగోలు చేసి మిల్లింగ్ అనంతరం పీడీఎస్ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పండే చిరుధాన్యాలు , కందులు స్థానికంగానే కొనుగోలు చేసి రైతులకు సంపూర్ణ మద్ధతు ధర అందించి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa