టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలకకగా.. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలు, ఫొటో అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
ప్రజలకు సేవ చేసే శక్తి, అవకాశం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. దుష్టుల నుంచి సమాజాన్ని రక్షించాలని శక్తి స్వరూపిణి కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని.. అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, దుష్టశక్తులు అడ్డుకున్నా తన పయనం ఆగబోదని అన్నారు. భవిష్యత్ కార్యచరణకు శ్రీకారం చుట్టబోయే ముందు.. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని.. అందుకే తాను ఈ యాత్ర చేపట్టానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa