పవిత్రమైన కార్తీక మాసంలో డిసెంబర్ 11న వైజాగ్ లో దాతల సహకారంతో కార్తీకదీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీకదీపోత్సవంలో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన రికార్డింగ్ పనుల కోసం ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ సహకారం తీసుకోవాలని సూచించారు జేఈవో.
అవసరమైన విభాగాల నుండి ముందస్తుగా డెప్యుటేషన్ పై సిబ్బందిని పంపాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు ముందుగా వెళ్లి వేదిక, క్యూలైన్లు తదితర పనులను ఎలాంటి జాప్యం లేకుండా చేపట్టాలన్నారు. ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
స్థానిక పోలీసుల సహకారం తీసుకొని తగిన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తగినంతమంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని, మీడియాతో సమన్వయం చేసుకోవాలని పీఆర్వో డా.టి.రవికి సూచించారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కోసం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేదపఠనం కోసం తిరుమల ధర్మగిరి వేద పాఠశాలతో పాటు ఎస్వీ వేద వర్సిటీ నుంచి వేదపండితులను ఆహ్వానించాలన్నారు. అనంతరం దాతలతో వర్చువల్ సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. వేదికను త్వరితగతిన ఖరారు చేయాలని దాతలను కోరారు.
కార్తీక వన భోజన కార్యక్రమం ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని వైభవోత్సవ మండపంలో జరుగనుంది. సాదారణంగా గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో నిర్వహించడం ఆనవాయితీ. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వైభవోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వైభవోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జితబ్రహ్మూెత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులతో పాటుగా సిబ్బంది పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa