సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఒంగోలు పట్టణంలో ఆర్ఎస్ యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగరాజు, జిల్లా కార్యదర్శి అవినాష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ళలో చదివే విద్యార్థులకు గత ఏడు నెలలుగా మెస్ ఛార్జీలు చెల్లించలేదని, వాటిని వెంటనే చెల్లించాలని, విద్యార్థులకు వార్డెన్లు నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa