జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విజయవాడ టీడీపీ నేత కేశినేని చిన్ని (శివనాథ్) హైదరాబాద్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో తెలుగుదేశం పార్టీకి మరియు శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును ప్రత్యేకంగా అభినందించినట్లు చిన్ని తెలిపారు. అలాగే విజయవాడ పార్లమెంటు పరిధిలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలు (అన్నా క్యాంటీన్లు, మెడికల్ క్యాంపులు) ఇతర సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ అభినందించారు.
మరోవైపు వన సమారాధనల పేరిట ఇతర కార్యక్రమాలతో జనసేన, టీడీపీ కేడర్ కలిసి ప్రయాణం చేస్తున్న వైనాన్ని వివరించినట్లు చిన్ని తెలిపారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా.. చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు చేసిన సేవలను వివరించానన్నారు. ఏ కొండూరు మండలంలోని తండాలను పర్యటించి బాధితులకు ధైర్యాన్ని ఇవ్వాలని పవన్ కళ్యాణ్ను కోరినట్లు చెప్పుకొచ్చారు. కేశినేని చిన్ని పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశానని చెబుతున్నా.. ఈ ఇద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa