వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం, మహిళా విభాగం నూతన కమిటీలను నియమించారు. కొత్తగా కార్యవర్గాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్గాంధీ, పిన్నెళ్లి వెంకట్రామిరెడ్డిని నియమించారు. మొత్తం 64 మందితో నూతన కమిటీని నియమించినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీని నియమించారు.వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణిలు ఇద్దరినీ అధ్యక్షులుగా నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంతెన మాధవీవర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళను నియమించారు. మొత్తం 64 మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (నంద్యాల) నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి (విశాఖపట్నం), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (పల్నాడు), తప్పెట్ల సాహిత్ రెడ్డి (అన్నమయ్య రాయచోటి) నియమితులయ్యారు. జోన్-1 ఇన్ఛార్జ్గా అవనాపు విక్రమ్ (విజయనగరం), జోన్-2, ముత్తంశెట్టి వెంకట శివసాయి నందీష్ (విశాఖపట్నం), జోన్-3, జక్కంపూడి గణేష్ (తూర్పు గోదావరి), జోన్-4 పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు (కృష్ణా), జోన్- 5 మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, జోన్- 6, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (తిరుపతి), జోన్- 7 ఎం మధుసూధన్ రెడ్డి (కర్నూలు), జోన్-8 ఎల్లారెడ్డి ప్రణయ్ కుమార్ రెడ్డి (అనంతపురం) లను నియమించారు. వైఎస్సార్సీపీ అధికారిక ప్రతినిధులుగా తుమ్మా బాబుల్ రెడ్డి (పల్నాడు), జీవీ ప్రసాద్ (నెల్లూరు), కల్లం హరికృష్ణారెడ్డి (గుంటూరు)ను నియమించింది వైసీపీ అధిష్ఠానం. ప్రధాన కార్యదర్శులుగా ఛెట్టి వినయ్ (అల్లూరి సీతారామరాజు), ముండ్ల అక్షయ్ రెడ్డి (కడప), భవనం వంశీ రెడ్డి( గుంటూరు), కందుల దినేష్ రెడ్డి (ఏలూరు), మల్లెల పవన్ కుమార్ (బాపట్ల) లకు పదవులు దక్కాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa