ఏపీ మునిసిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ప్రథమ మహాసభ జనవరి 7న విశాఖపట్నంలోని గురజాడ కళావేదికలో జరగనుంది. ఆ రోజున నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోనున్నారు. ఈ మేరకు ప్రథమ మహాసభ పోస్టర్ను విజయవాడ రెవెన్యూ భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మునిసిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వర్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ మునిసిపల్ ఉద్యోగులందరిని సంఘటితం చేయాలన్న ఆశయంతో వారి కోసం అహర్నిశలు పనిచేస్తానని, ప్రతి ఉద్యోగికి అసోసియేషన్ అండగా నిలుస్తుందని, క్యాడర్ బలోపేతానికి, సూపరింటెండెంట్లకు గెజిటెడ్ హోదా సాధించడానికి అసోసియేషన్ రాజమార్గం అంటూ ఆయన అభివర్ణించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మునిసిపల్ ఉద్యోగుల ఐక్యత కోసమే ప్రథమ మహాసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa