వెనెజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలు జనం గాయపడినట్లు తెలుస్తోంది. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఒక్క ట్రక్కు కారణంగా 17 వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. వెనెజులాలోని స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా ఉన్న ఓ హైవేపై బుధవారం ఈ ప్రమాదం సంభవించింది. మొదట ఓ ట్రక్కు అతివేగంగా వెళ్తూ ముందు ఉన్న బస్సును, కార్లను ఢీకొట్టింది. దీంతో ఆ హైవేపై ఒక్కసారిగా ఏం జరుగుతుందో వాహనాల్లో ఉన్న వారికి అర్థం కాలేదు. ఈ ప్రమాదంలో ఒక బస్సు, పలు కార్లు సహా మొత్తం 17 వాహనాలకు మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే.. వాహనాలన్నీ కాలి బూడిద అయ్యాయి. దీంతో ఆ వాహనాల్లో ఉన్న ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. బయటికి రాలేక లోపల మంటల్లో చిక్కుకుని చనిపోయారు.
అయితే ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. అందులో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్లలో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు పంపించారు. ఇక చనిపోయిన మృతదేహాలను బయటికి తీసి మార్చురీలకు తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa