వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్ యాత్ర లో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిమాట్లాడుతూ...వరుణ దేవుడు మన వెంట ఉండి ఆశీర్వదిస్తున్నట్టు ఉందీ రోజు. నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అందిస్తూ, పేదల ఆర్థిక స్థాయిని పెంచిన ముఖ్యమంత్రి జగనన్న. ఈరోజు ఏ పేదవాడికి ఆకలి బాధలు లేవు. పిల్లల చదువులు ఎట్లరా దేవుడా? అని తల పట్టుకునే పరిస్థితి లేదు. ఇల్లు గడవడం ఎలా అని ఆలోచించే పనిలేదు. పెద్దపెద్ద జబ్బులొచ్చినా భయపడాల్సిన పనిలేదు. మంచిమనసున్న జగనన్న వల్ల ప్రజలకు జరుగుతున్న మంచి అంతా ఇంతా కాదు. నిజంగానే సామాజిక విప్లవం ద్వారా సామాజిక సాధికారత సాధించిన జగనన్న, ఆర్థికంగా పేదలను పై స్థాయికి తీసుకువచ్చారు. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నారు. జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం. జగనన్న పాలనలోనే పేదల బతుకుల్లో వెలుగులు.చంద్రబాబును నమ్మితే మనం పూర్తిగా మునిగినట్టే. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను చులకనగా చూసి, అవమానాల పాలు చేసినవాడు చంద్రబాబు. నా బీసీ,నా ఎస్సీ,నాఎస్టీ, నామైనార్టీలంటూ మనల్ని అక్కున చేర్చుకుని, మనస్థాయిని పెంచిన, పెంచుతున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం మన ధర్మం. సింహంలాంటి జగనన్న అడుగుల్లో అడుగులేసి ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa