ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 640 మందికి కరోనా.. 3 వేలకు చేరిన యాక్టివ్ కేసులు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 11:17 PM

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. గతవారం రోజులు నుంచి కోవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కు చేరుకుంది. కరోనాతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,50,07,212కు చేరుకోగా.. 5,33,328 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 220.67 కోట్ల డోస్‌ల టీకాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


కేరళలో కొత్త వేరియంట్ జేఎన్.1 వెలుగుచూసినట్టు కేంద్ర ప్రభుత్వం గతవారం ధ్రువీకరించింది. ఇది BA.2.86 వేరియంట్‌తో దగ్గరి సంబంధం కలిగి ఉంది. దీనిని పిరోలా అని కూడా పిలుస్తారు. ఇటీవల అమెరికా, చైనాలో దీనిని కనుగొన్నారు. దేశంలో నమోదయిన మొత్తం కేసుల్లో దాదాపు 80 శాతం కేరళలోనే ఉన్నాయి. గత నాలుగు రోజులుగా కేరళలో రోజువారీ కేసులు వందల్లోనే నమోదవుతున్నాయి. కేరళలో ప్రస్తుతం 2606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ,మహారాష్ట్ర లో ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.


కోవిడ్ కేసులు, లక్షణాలను పర్యవేక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్యులను అభ్యర్థించింది. చాలా మంది రోగులు దగ్గు, ఒళ్లు నొప్పులు, బలహీనత, రియు కొన్నిసార్లు జ్వరం వంటి లక్షణాలతో వచ్చారని, అయితే కొంతమంది రోగులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. వారిలో ఎక్కువ మంది వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారేనని అంటున్నారు.


‘కోవిడ్-19 కారణంగా ఆసుపత్రిలో చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. అన్ని వయసుల వారు ఉన్నారు. ఇప్పుడు 15 నుంచి 20 మంది కోవిడ్ రోగులు ఆసుపత్రిలో చేరారు. కొంతమంది ముఖ్యంగా వృద్ధులు ఏసీయూ అడ్మిషన్ అవసరమయ్యే రోగులు ఉన్నారు. మేము అలాంటి పరిస్థితికి సిద్ధంగా లేం.. ఇప్పుడు ఆసుపత్రిలో కోవిడ్ గదులను పెంచాం.. ఆసుపత్రికి వచ్చే రోగులందరూ మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్‌లను ఉపయోగించాలని మేము స్పష్టం చేశాం’ అని కిమ్స్ హెల్త్‌కేర్ గ్రూప్ కేరళ విభాగం ఛైర్మన్ డాక్టర్ ఎంఐ షహదుల్లా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa