ఇంతకు ముందు దళితకుటుంబాల వారు తలవంచుకుని బతికేవారు. అలాంటి వారిని అక్కున చేర్చుకుని, వారి తలరాతలు మార్చారు జగనన్న అని ఎంపీ సంజీవ్కుమార్ అన్నారు. అయన మాట్లాడుతూ..... జగనన్న పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక సాధికారత సాధించిపెట్టారు సీఎం జగనన్న. సామాజిక న్యాయానికి అసలు సిసలు అర్థం చెప్పారు. ఈరోజు మనం ఎవరికీ భయపడాల్సిన లేదు. మనకు జగనన్న అండ ఉంది. ఆయన చేయూత ఉంది. ఆయన భరోసా ఉంది. దేవుడు జగన్గారి వెంట ఉన్నాడు. ఆయన ద్వారా మనకు సాయం చేసేలా చేస్తున్నాడు. ఇప్పుడు జగనన్న పాలనలో మన ఆత్మగౌరవం పెరిగింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ జగనన్న వెంట నడవాలి. పేదల కోసం, బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం జగనన్న చేస్తున్న మంచి, దేశంలో ఏ రాష్ట్రంలో... ఏ ముఖ్యమంత్రి చేయట్లేదు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa