వైసీపి చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.... ఈ నాలుగున్నరేళ్లలో భారతదేశంలో ఎక్కడా లేని సంక్షేమపథకాలు అమలు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. గ్రామ,వార్డు సచివాలయాలతో చరిత్రను సృష్టించారు జగనన్న. మనం పేదరికం నుంచి బయటకు రావాలి. కష్టాల నుంచి బయటకు రావాలి. నష్టాలనుంచి బయటపడాలి. మనలాంటి బడుగు,బలహీన,పేదల ప్రజలకు సాయం అంటూ చేస్తే దేవుడే చెయ్యాలి. ఆ దేవుడు లాంటి మనిషి జగనన్న మనకు అన్ని విధాలా సాయం చేస్తున్నాడు. నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు.చంద్రబాబు హయాంలో ఒక్క స్కూలు కట్టలేకపోయాడు . 34వేల స్కూళ్ల రూపురేఖలు మార్చేసాడు జగనన్న. అమ్మ ఒడి పథకంతో తనే మన పిల్లల్ని చదివిస్తున్నాడు. ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారు మన పిల్లలంటే..అది జగనన్న వల్లనే. మన పిల్లల భవిష్యత్తు కోసం, రేపటి పోటీ ప్రపంచంలో పోటీ పడేలా చదువుల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చాడు జగనన్న అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa