ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారుల సమస్యలని పరిష్కరిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 03:11 PM

తమిళనాడు మత్స్యకారుల దాడులు, మత్స్య సంపద దోపిడీపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటూ ఏపీ ప్రభుత్వంతోనూ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖల మంత్రి పురుషోత్తం రూపాలా స్పష్టం చేశారు. నెల్లూరుజిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌హార్బర్‌లో సోమవారం 10వ సాగర పరిక్రమ కార్యక్రమం జరిగింది. నౌకాయానషి్‌పలో వచ్చిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల దంపతులకు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, కావలి ఎమ్యెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, ఆప్కాబ్‌ చైర్మన్‌ అనిల్‌బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో గంగపుత్రుల సమస్యలను ఎమ్యెల్యే, మత్స్యకార నేత గోవిందస్వామి కేంద్రమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పురుష్తోత్తం రూపాలా మాట్లాడుతూ.. ఫిషింగ్‌ హార్బర్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హార్బర్‌నిర్మాణంలో కొద్దిపాటి మార్పులు, పొడిగింపు సహా తుఫాన్‌ వంటి ప్రకృతి విపత్తుల్లోబోట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు తీసుకుంటామన్నారు. బోట్లు నిలిచేందుకు మరోవైపు ప్లాట్‌ఫాం ఏర్పాటు విషయమై అధికారులతో మాట్లాడతామని చెప్పారు. ఇక తమిళనాడులోని కడలూరు ప్రాంత మత్స్యకారుల దాడులు, ఆంధ్రలోని మత్స్యసంపద దోచుకుపోవడంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మత్స్యకారులకు రాయి తీరుణాల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ కమిషనర్‌ కన్నబాబు, జేడీ నాగేశ్వరరావు, జేసీ కూర్మనాథ్‌, తహసీల్దారు హేమంత్‌కుమార్‌, సర్పంచు అంకమ్మ, బీజేపీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa