ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ నాకు సమాధానం చెప్పాలి.. దళితులంటే చిన్న చూపా: వైసీపీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 07:48 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న మార్పులు, చేర్పులపై విరుచుకుపడ్డారు. తాను చేసిన తప్పేంటో సీఎం జగన్ చెప్పాలని.. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ను కలిసినప్పుడు తనపై వ్యతిరేకత ఉందని చెప్పారని.. ఓడిపోయే చోట కూడా ఓసీలను అలాగే ఉంచుతున్నారన్నారు. మంత్రులు, పార్టీ పెద్దలు చెప్పినట్లు పనిచేశానని.. జగన్ చెప్పింది చేశాను.. ఇప్పుడు తన తప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు.


ఐదేళ్లలో ఎప్పుడైనా సీఎం జగన్ పిలిచి మాట్లాడారా అని ప్రశ్నించారు ఎంఎస్ బాబు. దళితులకు జగన్ ఏం న్యాయం చేశారని.. దళిత ఎమ్మెల్యేలు అంటే చిన్నాచూపా అన్నారు. ఇప్పుడు తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. ఐప్యాక్ వాళ్లకు డబ్బులు ఇస్తే సర్వే రిపోర్టు మార్చేస్తున్నారని.. జగన్ చెప్పకముందే గడప గడపకు తిరిగానన్నారు. ఐప్యా క్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని .. ఈసారి పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లా ఓసీ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్న మార్చలేదన్నారు. డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారన్నారు. గత ఎన్నికలలో ఐప్యాక్ సర్వే ఇస్తేనే తనకు టికెట్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని.. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ నమ్మకం ఉందన్నారు. పార్టీ వీడే ప్రసక్తే లేదని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉందని.. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa