ప్రతిపక్షనేతగా పింఛన్ను రూ. 3,000 చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్... అధికారంలోకి వచ్చాక ఏటా రూ. 250 పెంచుతూ మోసం చేశారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు. నిజం చెబితే తల వేయిముక్కలవుతుందనే శాపం సీఎం జగన్ను వేధిస్తున్నట్లుంది. నోరు తెరిస్తే అబద్దం చెప్పడం తప్ప ఒక్క రోజు కూడా నిజాలు మాట్లాడడం లేదన్నారు. అధికారంలోకి వస్తే రూ.3వేలు పెన్షన్ ఇస్తానన్న అదే నోటితో అధికారంలోకి వచ్చీ రాగానే ఏటా పెంపు అంటూ మాట మార్చి ఒక్కొక్కరికి రూ.30వేలు ఎగనామం పెట్టారన్నారు.
ఇప్పుడు పెన్షన్ దారులకు లేఖలో కూడా అవే పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.200 ఉన్న పెన్షన్ 2019 నాటికి రూ.2000 చేశారన్నారు. అంటే ఐదేళ్లలో రూ.1800 పెంచారు. పెన్షన్ లబ్దిదారుల సంఖ్య 34 లక్షల నుండి 54.25 లక్షలకు పెంచారని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచింది రూ.750 మాత్రమే అయినా సిగ్గులేకుండా ఉద్దరించానని చెప్పుకుంటున్నారన్నారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ మొత్తాన్ని ఎక్కడైనా తీసుకునే అవకాశముంటే.. ఇప్పుడు కేవలం 15కి.మీల పరిధిలోనే ఉండాలంటూ సిగ్గులేకుండా జీవోలిచ్చారని ధ్వజమెత్తారు.
ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే నంటూ లబ్దిదారులకు నోటీసులిచ్చిన దుర్మార్గ పాలన జగన్ ప్రభుత్వానిదే అన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో రూ.7లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉన్నప్పటికీ 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చి.. పెన్షన్ మొత్తాన్ని కూడా రూ.1800 వరకు పెంచారన్్నారు. రూ.12లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసిన జగన్ ఐదేళ్లలో కొత్తగా ఇచ్చిన పెన్షన్లు 10 లక్షలు మాత్రమే అన్నారు. చరిత్రలో తొలిసారిగా కిడ్నీ, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి బాధితులకు పెన్షన్లు మంజూరు చేసింది చంద్రబాబే అన్నారు.
గిరిజనులకు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారికి 50 ఏళ్లకు పెన్షన్ చేసిందీ చంద్రబాబే అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ట్రాన్స్ జెండర్లకు కూడా పెన్షన్లు మంజూరు చేస్తే.. జగన్ రద్దు చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి అబద్దాలను నమ్ముకున్నారని.. అధికారంలోకి వచ్చాక కూడా అవే పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారన్నారు. జగన్ చెప్పే అబద్దాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి పింఛన్లను పెంచింది. ఈ విషయంపై స్పందిస్తూ అచ్చెన్నాయుడు స్పందించారు. ఏపీ ప్రభుత్వం పింఛన్లు తీసుకునేవారిని మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పింఛన్లపై ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa