విజయవాడలో ఓ వ్యక్తి అందర్ని టెన్షన్ పెట్టించాడు. అజిత్సింగ్నగర్ హిందూ శ్మశానవాటికలోని పెద్ద పొగగొట్టం ఎక్కి హల్చల్ చేశాడు. స్థానికులు వెంటనే గమనించి అజిత్సింగ్నగర్ సీఐకు సమాచారం అందించారు.. ఆయన అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్థానికులు, పోలీసులు చేరుకున్నారు. గొట్టం చుట్టూ కింద భాగంలో వలలు కట్టారు.. పైనున్న వ్యక్తితో మైక్ ద్వారా మాట్లాడారు. అతడు.. సరిగా మాట్లాడలేకపోతుండటంతో మద్యం మత్తులో ఉండొచ్చని అనుమానించారు.
మద్యానికి అలవాటు పడిన వ్యక్తి అని తెలియడంతో.. మందు ఇస్తాం కిందకు రమ్మని పోలీసులు ఆశ చూపారు. అయినా దిగకపోవటంతో.. ఏం చేయాలో ఎవరికీ అర్థంకాలేదు. గొట్టం చుట్టూ వలలు కట్టినా.. పక్కనే నిర్మాణాలు ఉండటంతో టెన్షన్ పడ్డారు. వెంటనే స్థానిక సీఐ చొరవ తీసుకుని.. 'నిన్ను ఏం చేయను, కిందకు దిగిరా' అంటూ అతడ్ని బుజ్జగించారు. మెత్తబడిన అతడు.. నెమ్మదిగా క్షేమంగా కిందకు దిగాడు. అతడ పేరు సోమయ్య అని, వాంబేకాలనీవాసిగా గుర్తించారు. పోలీసులు దగ్గరుండి మంచినీళ్లు, అల్పాహారం ఇచ్చారు. మద్యం మత్తులో అతడు ఏం మాట్లాడలేకుండా ఉండడంతో ఇంటికి పంపించారు. ఈ ఘటనతో గంటసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కంగారుపడ్డారు. కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa