వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ..... ఎస్సీలు, ఎస్టీలకు మంత్రి పదవులు చంద్రబాబు ఇవ్వలేదు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. జగనన్న.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ వీరిని పదవుల్లో కూర్చోబెట్టారు. సామాజిక సాధికారతకు నిజమైన అర్థం చెప్పిన జగనన్న. భవిష్యత్ తరాలు బాగుండాలని, విద్య, వైద్యంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ప్రయివేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం పెట్టాలని ప్రయత్నిస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లారు. ఎక్కడపడితే అక్కడ లిక్కర్ దొరికేలా చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. కానీ జగనన్న అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా కాపాడి మందులు ఉచితంగా ఇచ్చి, డాక్టర్ను మీ ఇంటికి పంపిస్తానంటున్నారు. తేడా గమనించాలి. వచ్చే ఎన్నికలు పచ్చి అబద్ధాలకోరుకు, మాట మీద నిలబడే నాయకుడికి మధ్య జరగబోతున్నాయి. జగనన్నకు మనందరం మద్దతిచ్చి కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa