సంక్రాంతికి రాజమహేంద్రవరం జిల్లాలో కోడిపందాలు ఆడనీయం. వాటిని నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా అందరూ పాటించాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత, జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సీజన్లో కోడిపందాల నిషేధాన్ని సమర్థ వంతంగా అమలు చేయడానికి జిల్లా డివిజన్ మండల, గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో సంయుక్త తనిఖీ నిర్వహించా లన్నారు.కోడిపందాలు ఎక్కడా జరగకుండా రెవెన్యూ, పోలీ సు,పంచాయతీరాజ్, పశు సంవర్థక శాఖ, స్థానిక సంస్థలు, సచివాలయ వ్యవస్థ వరకూ ప్రతి ఒక్కరూ పూర్తి సమన్వ యంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు సబ్- కలెక్టర్, రాజమహేంద్రవరం ఆర్డీవోలు ఆయా డివిజన్ల స్థాయిలో సంయుక్త తనిఖీ బృందాలను పరిశీలించి ఈనెల 25వ తేదీన ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.గతేడాది కోడిపం దాలు నిర్వహించిన ఆట స్థలాల్లో ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచా యతీ కార్యదర్శి, మహిళా పోలీసులు సమన్వయంతో పనిచే యాలని,తహశిల్దార్, మండల పశుసంవర్థక శాఖ అధికా రి,స్టేషన్ హౌస్ అధికారి, మండల స్థాయిలోనూ, సబ్-కలెక్టర్, ఆర్డీవోలు,డీఎస్పీ, డివిజనల్ పశుసంవర్థక శాఖ అధికారులు, ప్రభుత్వేతర సంస్థ సభ్యుడు, డివిజన్ స్థాయిలోనూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ పి.జగదీష్ వివరిస్తూ కోడిపందాల నిర్వాహకులపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించామన్నారు. ఎక్కడైనా బరులు ఏర్పాటు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి కూల వార్తలను పరిగణనలోకి తీసుకుని, తనిఖీలు నిర్వహిం చి, ధ్రువీకరించిన అనంతరం చర్యలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa