అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీక్షా విరమణ సమయంలోనూ ప్రత్యేక బస్సులు కేటాయించకపోవడంతో శబరిమల వెళ్లే స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, దేవాదాయశాఖ మంత్రిగానీ కనీసం సమీక్షలు చేసే పరిస్థితి కూడా లేదని ఆరోపించారు. రద్దీ ఉన్న సమయంలో రవాణా బస్సుల కేటాయింపుతో పాటు, సంబంధిత అధికారులతో గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడి సమస్య పరిష్కరించేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ సభలకు ప్రత్యేక బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని తరలించడంపై ఉన్న శ్రద్ధ.. అయ్యప్ప స్వాములకు ప్రత్యేక బస్సులు కేటాయించడంపై లేదని అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది గాయాలపాలైనా ప్రభుత్వం నుంచి స్పందన లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎలక్షన్.. సెలక్షన్.. కలెక్షన్పై ఉన్న శ్రద్ధ.. అయ్యప్ప భక్తులపై లేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే శబరిమల వెళ్లే భక్తుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa