ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో ఏపీ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకునే మోదీ.. అక్కడి నుంచి హెలికాప్టర్లో లేపాక్షికి చేరుకుంటారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించడంతోపాటు.. అక్కడి శిల్పకళా సంపదను మోదీ తిలకించనున్నారు. అనంతరం నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్స్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్)ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా నాసిన్ సంస్థను ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేటాయించారు. ఐఆర్ఎస్, కస్టమ్స్ అధికారులకు నాసిన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రస్తుత సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
నాసిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీం వైఎస్ జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా లేపాక్షి, నాసిన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ పర్యటన వివరాలను ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ‘ఈ రెండు రోజులు నేను ఆంధ్రప్రదేశ్, కేరళలో ఉంటాను. ఇవాళ, జనవరి 16న లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయంలో ప్రార్థించే అవకాశం నాకు లభించింది. తెలుగులో ఉన్న రంగనాథ రామాయణంలోని పద్యాలను వింటాను. ఆ తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తాను. 17వ తేదీన కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని, త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయాన్ని సందర్శిస్తాను. కొచ్చిలో కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తాను’ అని మోదీ పోస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa