వైసీపీ నేతలు కేశినేని నాని, కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే గుణపాఠం తప్పదని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర హెచ్చరించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని, అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన జెండాను ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభ విజయవంతమైందని తెలిపారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు ప్రభంజనంలా తరలి వచ్చి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు జిల్లాను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు సభ విజయవంతం కావడాన్ని చూసి జీర్ణించుకోలేని వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజమెత్తారు. కేశినేని నానికి ఇప్పటి వరకు గౌరవం ఇచ్చామని.. టీడీపీ నేతలపై ఆయన విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కొడాలి నానిని పక్క రాష్ట్రాల సీఎంలు కూడా తిడుతుంటే ఆయనకు సిగ్గనిపించడం లేదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa