ప్రపంచంలో మరో రాజ కుటుంబానికి చెందిన దంపతులు విడాకులు తీసుకుంటోంది. అల్బేనియా యువరాజు దంపతులు దాదాపు తమ ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ.. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అల్బేనియాకు చెందిన యువరాజు లేక, ఎలియా ఝరాయా.. 2016 అక్టోబరులో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి 2020లో ఓ పాప కూడా జన్మించింది. అయితే, ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా లేక వెల్లడించారు.
‘పరస్పర అంగీకారంతోనే చట్టబద్దమైన ప్రక్రియతోనే మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం... మా కుమార్తెకు సంతోషకరమైన, సురక్షితమైన జీవితాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. ఈ సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించొద్దని, కుటుంబ విలువలు ఎంతో గొప్పవని తాను బలంగా నమ్ముతానని ఎలియా అన్నారు. ఈ నిర్ణయం తనకు ఏమాత్రం సంతోషం కలిగించేది కాదని, అయితే కొన్నిసార్లు విడిపోవడమే సరైన ఎంపిక అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘మిత్రులు.. శ్రేయోభిలాషులు ఈ రోజు మేము విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం.. దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించాం’ అని అని తెలిపారు. 41 ఏళ్ల యువరాజు లేక అల్బేనియా ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. గాయని, నటి అయిన ఎలియా.. అల్బేనియన్కు నేషనల్ థియేటర్ తరఫున ప్రదర్శనలు ఇచ్చిన అనుభవం ఉంది.
1928 నుంచి 1939 వరకూ అల్బేనియా రాజుగా ఉన్న కింగ్ జోగ్ 1 మనమడైన లేక.. 2011లో తండ్రి లేక- 1 మరణం తర్వాత యువరాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఎలియా, లేక మొదటిసారి 2008లో కలుసుకోగా.. 2010 నుంచి ప్రేమలో ఉన్నారు. తర్వాత 2016లో వీరికి వివాహం జరిగింది. పెళ్లైన నాలుగేళ్లకు 2020లో పాప పుట్టింది. ఆ పాపకు లేక తన నాయినమ్మ రాణి గెరాల్డైన్ పేరు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa