అయోధ్యలో దివ్య రామమందిరం సోమవారం ప్రారంభోత్సవం జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం వేళ.. పాకిస్థాన్కు చెందిన ఉగ్రముఠా జైషే మహ్మద్ బెదిరింపులకు పాల్పడింది. అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా.. తాజాగా పాకిస్థాన్కు చెందిన ఉగ్రముఠా జైషే మహ్మద్ బెదిరింపులకు దిగింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలను ప్రస్తావిస్తూ.. అయోధ్యలో కల్లోల పరిస్థితులు ఉంటాయని తీవ్ర హెచ్చరించింది.
వరుస ఉగ్రవాద హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర భద్రతా సంస్థలు.. నిఘాను మరింత పెంచాయి. ప్రస్తుతానికి అయోధ్యలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని.. భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు.. దేశంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంతోపాటు గణతంత్ర దినోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రదాడులు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం, ఉగ్ర సంస్థల నుంచి వస్తున్న హెచ్చరికలతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. గతేడాది జనవరిలో కూడా రిపబ్లిక్ డే సందర్భంగా జైషే మహ్మద్ ఇదే రకమైన బెదిరింపులకు పాల్పడింది.
ఇక రామాలయ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు కొన్ని రోజుల నుంచి భద్రతను పెంచాయి. అయోధ్యలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉత్తర్ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్).. శుక్రవారం ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్ట్ చేసింది. ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడంపై ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ శుక్రవారం తీవ్ర హెచ్చరికలు చేస్తూ ఆడియో సందేశం పంపించాడు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను హత్య చేస్తానని బెదిరించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa