అనంతపురం జిల్లా,ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ యతీంద్ర శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని రాంనగర్కు చెందిన లక్ష్మీదేవిని దొరిగిల్లు అటవీ ప్రాంతంలో ఈ నెల 16వ తేదీన అనంతపురానికే చెందిన ఆదినారాయణ హత్య చేశాడన్నారు. ఆదినారాయణతో లక్ష్మీదేవి రూ.5 లక్షలు అప్పు తీసుకుని వడ్డీ వ్యాపారం, చీటీలు నడిపేదన్నారు. వారి పరిచయం వివాహేతర సంబంధంగా ఏర్పడడంతో.. దొరిగిల్లు అటవీ ప్రాంతంలోకి అప్పుడప్పుడు వస్తూ, మద్యం సేవించి వెళ్తుండేవారన్నారు. కాగా లక్ష్మీదేవితో అనంతపురానికి చెందిన మరో వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారిరువురూ సన్నిహితంగా ఉండడం చూసిన ఆదినారాయణ లక్ష్మీదేవి పై కక్ష పెంచుకున్నాడని తెలిపారు. ఎలాగైనా ఆమెను కడతేర్చాలని పథకం పన్నాడన్నారు. ఈక్రమంలో లక్ష్మిదేవికి మాయమాటలు చెప్పి ఈ నెల 16న మధ్యాహ్నం స్కూటీపై దొరిగల్లు ఘాట్ రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలోకి వచ్చారన్నారు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించారన్నా రు. ఆమెకు మత్తు ఎక్కువ కావడంతో ఆదినారాయణ ఆమె చీరతోనే మెడకు బిగించి హత్య చేశాడన్నారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. శనివారం ఉదయం రాళ్లనంతపురం క్రాస్ వద్ద ఆదినారాయణను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa