ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య వేదిక‌గా చంద్రబాబు- మాజీ సీజేఐ మధ్య చర్చలు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 03:17 PM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు రాజకీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన త‌ర్వాత చంద్రబాబు,
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కలిశారు. సుమారు అరగంట పాటు మాట్లాడారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa