ఏపీలో టీడీపీ, జనసేన కలయిక స్థిరత్వం, అభివృద్ది, ప్రజా సంక్షేమానికి పని చేస్తుందన్నారు సినీ నటుడు పృథ్వీరాజ్. టీడీపీ, జనసేనల రెండు జెండాల కలయిక అద్భుతం.. ఇది మార్పుకు శుభసూచికమన్నారు. 175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైఎస్సార్సీపీ నాయకులు.. ఇప్పుడు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 175కు 175 సీట్లు గెలుస్తామన్నప్పుడు భయం ఎందుకు.. ఈ మార్పులు ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల సీట్లు మార్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరన్నారు. 130కుపైగా అసెంబ్లీ స్దానాలు.. 21 ఎంపీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేనల మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన సీట్లలో వైఎస్సార్సీపీకి అవకాశం ఉందన్నారు. ఓ చోట గెలిచిన వ్యక్తిని మరోచోట తీసుకువెళ్లి వేస్తే ఓటు ఎవరు వేస్తారన్నారు.
షర్మిల ఇప్పడు జగనన్న వదిలిన బాణం కాదు.. అవన్నీ పాత రోజులన్నారు పృథ్వీ. ఇప్పడు షర్మిల స్వతంత్ర వ్యక్తి.. కాంగ్రెస్ పార్టీ బాణం.. పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారన్నారు. ఆ బాణం వల్ల వైఎస్సార్సీపీకి ఏం జరుగుతుందో చూడాలన్నారు. చంద్రబాబు, పవన్ వదిలిన బాణం పృథ్వీరాజ్ అన్నారు. రోజా లాంటి బూతుల మంత్రులు కుప్పకూలి పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. డ్యాన్సులు, సినిమాలు, సినిమా కలెక్షన్లు, డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడేవాళ్లు కూడా మంత్రులేనా ? అన్నారు. తాను సినిమాలో వేసిన అంబటి డ్యాన్సు గురించి ముందు తెలియదు.. డైరెక్టర్ చెప్పినట్లు చేశానన్నారు. రోడ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్లు మంత్రులు ఏంటి అంటూ సెటైర్లు పేల్చారు.
ప్రాజెక్టుల గురించి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుకు ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. ఈ అంబటి రాంబాబు ఎప్పుడు చూసినా మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడతాడని విమర్శించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏ ప్రాజెక్టు ఆగిపోయాయో చెప్పాలన్నారు.
ఏపీలో ఒక్క రాజధాని లేదు.. ఇంక మూడు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఎన్నికలు మొదలవుతున్నాయి.. ప్రచారానికి వస్తాను.. ఒక్కొక్కరి దుమ్ము దులుపుతానన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకూ తనను ప్రచారానికి వాడుకుని వదిలేసిన అధికార పార్టీ సంగతి చూస్తానన్నారు. ఎవరి జాతకం ఏంటనేది తన దగ్గర ఉందన్నారు. నారా లోకేష్ దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లు తన దగ్గర కూడా ఓపీఆర్ డైరీ ఉందని.. అందరి జాతకాలు బయటపెడతానన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పృథ్వీ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa