అయోధ్య బాలరాముడి ఆలయంలోకి మంగళవారం సాయంత్రం ఓ కోతి ప్రవేశించింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మర్నాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో హనుమంతుడిగా భక్తులు భావిస్తున్నారు. సాయంత్రం 5:50 గంటల సమయంలో గర్భగుడిలోకి దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన వానరం.. విగ్రహం వద్దకు చేరుకుంది. అనుకోని అతిథి రాకతో మొదట్లో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది.. విగ్రహానికి హాని కలిగిస్తుందేమోననే భయంతో కోతిని పట్టుకునే ప్రయత్నం చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
ఎటువంటి అంతరాయం కలిగించకుండా ఉత్తర ద్వారం నుంచి సునాయాసంగా గర్భగుడిని దాటే ప్రయతత్నం చేసింది. అది మూసివేయడంతో తూర్పు వైపునకు తిరిగి, తూర్పు ద్వారం గుండా ప్రశాంతంగా బయటకు వచ్చినట్టు పేర్కొంది. ‘ఈరోజు సాయంత్రం 5:50 గంటల ప్రాంతంలో ఒక కోతి దక్షిణ ద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించి ఉత్సవ విగ్రహం దగ్గరకు చేరుకుంది.. బయట ఉన్న భద్రతా సిబ్బంది అది చూసి కోతి ఉత్సవ విగ్రహాన్ని పడవేస్తుందేమోనని భావించి పరుగెత్తారు.. కానీ, వానం ప్రశాంతంగా ఉత్తర ద్వారం వైపు పరుగెత్తింది. గేటు మూసి ఉన్నందున తూర్పు వైపుకు వెళ్లి, జనసమూహాన్ని దాటుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తూర్పు ద్వారం గుండా బయటికి వెళ్లింది.. హనుమంతుడు స్వయంగా రామ్ లల్లాను చూసేందుకు వచ్చినట్లుగా ఉందని భద్రతా సిబ్బంది అంటున్నారు’ అని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్వీట్ చేసింది.
చాలా మంది భక్తులు ఈ సంఘటనను శ్రీరామునిపై హనుమాన్ నిరంతర సంరక్షకత్వానికి, కొత్తగా స్థాపించిన ఆలయంపై ఆయన ఆశీర్వాదాలకు సంకేతంగా భావిస్తున్నారు. అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ సోమవారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో పూజల అనంతరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa