నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ‘నిజం గెలవాలి..’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. నేటి ఉదయం 11.10 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ఎస్.మూలపొలం గ్రామంలో, 12.25 గంటలకు అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామంలో, 1.10 గంటలకు అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామంలో, 3.20 గంటలకు రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో, సాయంత్రం 5.30 గంటలకు మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో, 6.40 గంటలకు మండపేట మండలం పాలతోడు గ్రామంలో పర్యటించనున్నారు. రాత్రికి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం చేరుకుని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో భువనేశ్వరి బస చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa