జగన్రెడ్డి పాలనలో 50 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఆసరా ఇవ్వకుండా మోసం చేశారని పాణ్యం టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. రాష్ట్రంలో మహిళలను అన్ని రకాలుగా వంచించి వారి మాంగల్యాలు తెంచిన ఘనత జగన్కే సొంతమని గౌరు చరిత ఎద్దేవా చేశారు. మద్యం రేట్లు మూడు రెట్లు పెంచి రూ.2 లక్షల విలువగల నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ రూ.5 లక్షలకు వర్తింపజేస్తే జగన్రెడ్డి దాన్ని రూ.3 లక్షలకు కుదించి మోసం చేశారన్నారు. ఉచితంగా ఇళ్లు అని నమ్మించి ఓటీఎస్ పేరుతో మహిళల నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేలు బలవంతంగా వసూలు చేశారని, టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిం చిన టిడ్కో ఇళ్లు పంపిణీ చేయలేదని అన్నారు. పెళ్లి కానుక పథకానికి కఠి నతరంగా నిబంధనలు విధించి ఆడపిల్లలకు నష్టం కలిగించారని, అంగన్ వాడీలకు చంద్రబాబు రూ.6,300 జీతం పెంచగా, జగన్ రూ వెయ్యి మాత్రమే పెంచారన్నారు. సమావేశంలో లింగారెడ్డి, శివారెడ్డి, కాంతారెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa