కృష్ణా, యన్టీఆర్ జిల్లా, విజయవాడ సిటీ కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కారక్యమంలో రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మకశ్రీ, ఇతర నేతలు పాల్గొన్నారు. షర్మిల సీఎం అంటూ కార్యకర్త నినాదాలు చేశారు. ఆమె సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పులి కడుపున పులే పడుతుందని.. ఎవరు అవునన్నా.. కాదన్నా తాను వైఎస్ రక్తాన్నేనన్నారు. వైఎస్ బిడ్డగా.. ఆయన ఆశయాలను సాధిస్తానని షర్మిల పేర్కొన్నారు. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డికి వంగవీటి మోహన రంగా చాలా దగ్గర మనిషని.. ఆయన నిరాహారదీక్ష చేస్తుండగా చంపడం జరిగిందని షర్మిల గుర్తు చేశారు. ఆరోజు రాజశేఖరరెడ్డి చాలా బాధ పడ్డారని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa