భీమిలి నియోజకవర్గంలో జరుగనున్న వైసీపీ ‘‘సిద్ధం’’ ఎన్నికల శంఖారావం సభ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలను తీసుకొస్తున్న బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వైసీపీ సభలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలు, నేతలు తరలివెళ్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో వైసీపీ కార్యకర్తలు భీమిలికి పయనమవుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సభకు వెళ్లేందుకు బస్సులో బయలుదేరారు. అయితే అదే బస్సు క్రింద పడి బస్సు క్లీనర్ మృతి చెందడం కలకలం రేపింది. పుట్ బోర్డు మీద నిలబడి ఉన్న క్లీనర్ ఉప్పాడ లక్ష్మణరావు (48) అనుకోకుండా బస్సు టైర్ల క్రింద పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఎచ్చెర్ల మండలం కుశలపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa