ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ మహిళ చాలా లక్కీ.. ఆర్టీసీ బస్సులో ఆసక్తికర సంఘటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 09:37 PM

నిత్యం వేలాదిమంది జనాలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు.. జర్నీ సమయంలో కొందరు హడావిడిలో బస్సు ఎక్కేస్తుంటారు, దిగేస్తుంటారు. ఇలాంటి సమయంలో లగేజీని, విలువైన వస్తువల్ని మర్చిపోయి దిగిపోతుంటారు.. ఒక్కోసారి ఆ బ్యాగుల్లో బంగారం, డబ్బులు వంటివి ఉన్న సందర్భాలు చాలానే చూశాం. ఒకవేళ హడావిడిలో ప్రయాణికులు పొరపాటు చేసినా.. ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం వాటిని తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇలా తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా అదే జరిగింది.. ఓ ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి అందించి ప్రశంసలు అందుకున్నారు.


గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మండపేట సర్వీస్‌కు బయలుదేరి వెళ్లింది. కొత్తతుంగపాడుకు చెందిన ముచ్చిక గన్నెమ్మ ఆ బస్సులో బంగారు వస్తువులు, పట్టీలు ఉన్నబ్యాగును మర్చిపోయి బస్సు దిగి వెళ్లిపోయింది. ఇది గమనించిన ఆ బస్సు కండక్టర్‌ శేఖర్‌ ఆ వస్తువులను డిపో కు తెచ్చి మేనేజర్‌ రామన్నదొరకు అప్పగించారు. చివరకు గన్నెమ్మకు సమాచారాన్ని అందించారు. బస్సులో ఆమె మర్చిపోయిన వస్తువులను తిరిగి అందజేశారు. వస్తువుల విలువ రూ.60,000 ఉంటుందంటున్నారు. ప్రయాణికురాలు బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులను తిరిగి జాగ్రత్త గా ఆమెకు అందజేసిన ఆర్టీసీ కండక్టర్‌ను పలువు రు అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa