ట్రెండింగ్
Epaper    English    தமிழ்

22 మంది భారతీయ సిబ్బందితో వెళ్తోన్న వాణిజ్య నౌకపై క్షిపణి దాడి

national |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 10:33 PM

గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌక క్షిపణి దాడికి గురికావడంతో SOS కాల్‌కు భారత నావికాదళానికి చెందిన గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్ స్పందించిందని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. అందులో 22 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశ్ సిబ్బంది ఉన్నట్టు పేర్కొంది. వాణిజ్య నౌక మార్లిన్ లాండ్ క్షిపణి దాడికి గురైన తర్వాత ఓడలో మంటలు చెలరేగినట్టు ఐఎన్ఎస్ విశాఖపట్నం ఎస్ఓఎస్ కాల్‌ను అందుకుంది. కార్గో మంటలను ఆర్పడానికి ఐఎన్‌ఎస్ విశాఖపట్నం సహాయం చేస్తోందని భారత నౌకాదళం వెల్లడించింది.


‘భారత నావికాదళం దృఢంగా ఉంది.. వాణిజ్య నౌకల రక్షణ, సముద్రంలో జీవిత భద్రతకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉంది’ అని నౌకాదళం ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయేల్-హమాస్ యుద్ధం కొనసాగుతుండగా ఎర్ర సముద్రంలో వ్యాపార నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నాయి. దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతోన్న వేళ తాజా క్షిపణి దాడి చోటుచేసుకుంది. సముద్రంలో జరిగే ఇలాంటి సంఘటనలను పటిష్టంగా ఎదుర్కోవాలని అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 18న భారతీయ క్రూ సిబ్బందితో కూడిన వాణిజ్య నౌక గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో డ్రోన్‌ల ద్వారా దాడికి గురైంది. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న తర్వాత దానికి సాయంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను భారత్ మోహరించింది. 21 మంది భారతీయ సిబ్బందితో లైబీరియన్ జెండాతో కూడిన MV కెమ్ ప్లూటో డిసెంబర్ 23న గుజరాత్ తీరంలో డ్రోన్ దాడికి గురి అయింది. MV కెమ్ ప్లూటోతో పాటు భారతదేశానికి వెళుతున్న మరో వాణిజ్య చమురు ట్యాంకర్ అదే రోజు దక్షిణ ఎర్ర సముద్రంలో అనుమానాస్పద డ్రోన్ దాడికి గురైంది. ఈ నౌకలో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇక, ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణిని అమెరికా-బ్రిటన్ దళాలు గురువారం కూల్చివేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa