కృష్ణాజిల్లాలో అభ్యర్థుల ప్రకటనకు వైసీపీ తెరదించింది. మచిలీపట్నం పార్లమెంట్ సహా దాని పరిధిలోని అన్ని స్థానాలకు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసింది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ను ప్రకటించింది. మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టు, పెడన నుంచి ఉప్పాల రాము, పెనమలూరు నుంచి జోగి రమేశ్ పేర్లను ఇప్పటికే ప్రకటించగా, అవనిగడ్డ నుంచి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరును బుధవారం ప్రకటించారు. పామర్రు, గన్నవరం, గుడివాడ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, గుడివాడ నుంచి కొడాలి నాని పేరు లాంఛనమే. గన్నవరం నుంచి వంశీ పోటీపై అనుమానాలు ఉన్నా చివరికి ఆయనే అభ్యర్థిగా ఉండొచ్చని పార్టీ శ్రేణుల మాట. పార్టీ నుంచి ఆర్థిక దన్ను కోసమే వంశీ ఊగిసలాట ధోరణి కనబరుస్తున్నారని వారు చెబుతున్నారు. పామర్రు నుంచి కైలే అనీల్ విషయంలోనూ మార్పు ఉండకపోవచ్చని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa