ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన వారిలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి . అజీర్ణం అనేది చాలా మందిని వేధించే సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, వికారం, గుండెల్లో మంట, వాంతులు వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో ఏమీ అక్కర్లేదని అనిపించడం సహజం. ఇలాంటప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ఇంట్లో ఉండే వస్తువులతో అజీర్తి సమస్యను అధిగమించవచ్చు
అజీర్ణం కోసం ఇంటి నివారణలు:
మజ్జిగలో ఉప్పు కలిపి రోజూ తాగితే అజీర్తి సమస్య కూడా తీరుతుంది.
భోజనం తర్వాత అల్లం నమలడం వల్ల కూడా అజీర్ణం నయమవుతుంది.
భోజనం తర్వాత అరటిపండు తినడం వల్ల అజీర్తి సమస్యను దూరం చేసుకోవచ్చు.
ఎండుమిర్చి, వెల్లుల్లిని కొద్ది మొత్తంలో కలిపి వేయించి భోజనంలో తీసుకుంటే జీర్ణశక్తి కూడా మెరుగై అజీర్తి సమస్య దరిచేరదు.
భోజనానికి ముందు కొన్ని జీలకర్రను నోటిలో వేసుకుని నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
నిమ్మరసాన్ని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి రోజుకు మూడుసార్లు సేవిస్తే అజీర్తి తగ్గుతుంది.
నిమ్మరసం తాగడం వల్ల అజీర్ణం వల్ల వచ్చే పులుపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
పసుపు పొడిని వంటలో కలపడం వల్ల కూడా అజీర్ణం తగ్గుతుంది.
భోజనం తర్వాత ఏలకులను బాగా నమిలితే అజీర్తి సమస్య దూరమవుతుంది.
పుదీనా ఆకులను రోజూ నమలడం వల్ల ఆహారం జీర్ణమై అజీర్తి సమస్య దరిచేరదు.
తులసి రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
అజీర్తి సమస్య ఉన్నప్పుడు లవంగాలను కషాయం చేసి తాగితే మంచిది.
భోజనం చేసిన తర్వాత పొట్టు తీసిన ఖర్జూరాన్ని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa