ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపారు. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైఎస్సార్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు ఈ నెల 12వ తేదీన విచారణకు వెళతారా లేదా అన్నది చూడాలి.
అనర్హత నోటీసుపై స్పీకర్ తమ్మినేని సీతారాంను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల 8న కలిశారు. స్పీకర్తో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావడం రెండోసారి అని చెప్పుకొచ్చారు.మొదటి సారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారనీ.. అవన్నీ తాను చెప్పానన్నారు. దానికి సంబంధించిన పేపర్లను కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. అనర్హత నోటీసుపై స్పీకర్కు 5వ తేదీన తమ దగ్గర ఉన్న పత్రాలను ఇచ్చామని అన్నారు. మీడియాలో ప్రచురించిన వాటిని చీఫ్ విప్ ప్రసాదరాజు ఇచ్చారని..వేరే మేనేజ్మెంట్కు సంబంధించినవి ఆయనెలా ఆథరైజ్ చేస్తారో చెప్పాలన్నారు. ఆరోపించిన ప్రసాదరాజు ఆథరైజ్ చేస్తే వాటికి విలువ ఉండదని అన్నారు. పెట్టిన సాక్ష్యాధారాలు ఏవీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం విలువైనవి కావని ఆరోపించారు. ఇవి తీసుకుని మీరెలా చేస్తారని స్పీకర్ ను అడిగినట్లు ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa