రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి, వైయస్ఆర్సీపీకి ఉన్న ప్రజాబలాన్ని ఢీకొట్టడం ప్రతిపక్ష పార్టీలకు సాధ్యమయ్యే పనికాదని గ్రహించడం వల్లే మొత్తం పార్టీలన్నీ మూకుమ్మడిగా దాడికి సిద్ధమవుతున్నాయని ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన క్షత్రియ యూత్ ఉద్దరాజు రాజేష్వర్మ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైయస్ఆర్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం వైయస్ జగన్ గత ఐదేళ్లుగా జనరంజకమైన పాలన అందించడంతో అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, దీంతో రానున్న ఎన్నికల్లో మరోసారి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమైందని చెప్పారు. వైయస్ జగన్ ప్రజా బలాన్ని చూసి భయపడిన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒంటరిగా పోటీ పడలేక మూకుమ్మడిగా పోటీకి రావాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన వంటి పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే తమ పార్టీ కార్యాలయాలను మూసేసే పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించడం వల్ల చంద్రబాబు గతంలో గెల్చుకున్న 23 స్థానాలైనా దక్కించుకోవడానికి పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ 175 సీట్లు గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల, రాష్ట్ర యువత నాయకుడు గ్రంధి రవితేజ, ఎంపీపీ పేరిచర్ల విజయ నర్సింహరాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు తదితరులున్నారు. పార్టీలో చేరినవారిలో ఉద్దరాజు అప్పలరాజు, కూనపరాజు దుర్గరాజు, ముదునూరి శివనాగరాజు, అల్లూరి వెంకట కృష్ణంరాజు, పి.చల్లారావు, సుబ్రమణ్యం, కూనపరాజు వాసురాజు తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa