పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ చేసిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కానిస్టేబుల్.. అతని భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో వెంకట్ నాయక్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే గత జనవరి నెలలో ఓ దొంగతనం కేసులో బాధితురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తను పోలీసులు అరెస్ట్ చేయటంతో బాధితురాలు భయపడిపోయింది. ఈ సమయంలో బాధితురాలికి సాయం చేస్తానంటూ కానిస్టేబుల్ వెంకటనాయక్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తన భర్త విషయంలో సాయంగా ఉంటానంటూ ఆమెను నమ్మించాడు.
అయితే సాయం చేస్తానంటూ నమ్మించి.. తాను మూడునెలల గర్భవతిని అని చెప్పినా వెంకటనాయక్ వినకుండా లైంగికదాడికి పాల్పడ్డాడని వివాహిత ఆరోపించింది. దీంతో అబార్షన్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చాడన్న బాధితురాలు.. ఇప్పటికీ కానిస్టేబుల్ తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. కానిస్టేబుల్ వేధింపులపై పల్నాడు జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఎస్పీ కార్యాలయం సిబ్బంది ఇచ్చిన సలహా మేరకు కానిస్టేబుల్ వెంకటనాయక్ మీద దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు రాగా.. గురజాల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లమని చెప్పారన్నారు. అక్కడకు వెళ్తే దాచేపల్లి పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయమంటున్నారని వివరించారు. అయితే పోలీసుల వల్ల న్యాయం జరగదనే అనుమానంతోనే ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తున్నట్లు బాధితురాలు వివరించారు. కేసుల పేరుతో భయపెట్టి తనపై లైంగిక దాడికి దిగిన కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa