ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైళ్లో అనుమానాస్పద కదలికలు.. పోలీసులు వచ్చి చెక్ చేస్తే.. వామ్మో కళ్లు జిగేల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 07:34 PM

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా నగదు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే సోదాలు నిర్వహిస్తున్నారు. ఆధారాలు లేకుండా భారీగా నగదు తీసుకెళ్తుంటే అలాంటి నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నగదు పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్ చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తరుచుగా జరుగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. రైళ్లో తరలిస్తున్న బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


నరసరావుపేటలో మంగళవారం భారీగా నగదు, బంగారాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వినుగొండ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో రైళ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న 30 లక్షలు విలువజేసే 391 గ్రాముల బంగారం, 11 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల వద్ద ఈ బంగారం, నగదును గుర్తించిన పోలీసులు.. వీటికి సంబంధించిన బిల్లులను, పత్రాలను సమర్పించాలని కోరారు. అయితే వారివద్ద వీటికి సంబంధించిన బిల్లులు లేకపోవటంతో బంగారం, నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో దోసపాటి మోహనరావు, ఆనంద్‌ కుమార్‌ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు నర్సరావుపేట రైల్వే పోలీసులు తెలిపారు. వీరిద్దరూ విజయవాడలోని ఓ జ్యువెలరీ షాపులో గుమాస్తాలుగా పోలీసులు తెలిపారు. అయితే పత్రాలు ఏవీ లేకుండా అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో సీజ్ చేసినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa