లేపాక్షి మండల కేంద్రంలోని వెలుగు ఆఫీస్ నందు మహిళా సంఘాలకు 4వ విడత వైస్సార్ ఆసరా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త దీపిక మాట్లాడుతూ లేపాక్షి మండలంలోని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు బాసటగా వై. యస్. ఆర్. ఆసరా పథకం ద్వారా నాలుగో విడత 6, 619 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 4, 11, 29, 354లు వారి ఖాతాలలోకి వేయడం జరిగిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa