ఏపీలో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా(బర్డ్ ఫ్లూ) వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పోలీసు, రెవెన్యూ, అటవీ, పశుసంవర్ధకశాఖల ఆధ్వర్యంలో 721 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు చేశామని పశుసంవర్ధకశాఖ తెలిపింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల, కోవూరు మండలం గుమ్మలదిబ్బలో కోళ్ల మరణాలకు సంబంధించి.. నమూనాలను భోపాల్లోని ల్యాబ్కు పంపగా ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వ్యాధి సోకినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు. చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశామన్నారు.
ప్రభావిత గ్రామాలకు చుట్టూ కిలోమీటరు వరకు ఇన్ఫెక్టెడ్ జోన్గా, పది కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించినట్లు వివరించారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలు కట్టడి చేశామన్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కోళ్లలో అసాధారణ మరణాలు లేవని తెలిపారు. రాష్ట్రంలో కోళ్లు అధికంగా ఉండే కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతోపాటు వలస పక్షులు వచ్చే నెల్లూరు, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ అదుపులోనే ఉందని.. ఎవరికైనా అనుమానాలు ఉంటే 1962 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు.
ఈ వ్యాధి సోకిన చాటగొట్ల, గుమ్మలదిబ్బ గ్రామాలకు కిలో మీటరు ప్రాంతాన్ని ఇన్ఫెక్టెడ్ జోన్గా, 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించారు. ఈ గ్రామాలకు కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసి, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లతో కోళ్లలో వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలు చేపట్టారు. ఫ్లో సోకిన ప్రాంతంలో కిలో మీటర్ల పరిధిలో ఉన్న ఫౌల్ట్రీలలో మూడు నెలల పాటూ కోళ్లను బయటకు పంపొద్దని.. అలాగే ఆ ప్రాంతానికి కొత్త కోళ్లను తీసుకురావొద్దని సూచించారు.. అలాగే చికెన్ షాపుల్ని కూడా మూసివేయాలంటున్నారు. అలాగే ఫ్లో సోకిన ప్రాంతానికి 10 కిలో మీటర్ల పరిధిలో మూడు రోజులు పాటూ ఈ నిబంధనల్ని అమలు చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa